న్యూఢిల్లీ: భారత స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్సింగ్, లవ్లీనా బొర్గోహైకు అరుదైన అవకాశం లభించింది. హంగ్జు(చైనా) వేదికగా ఈనెల 23 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో జాతీయ పతాకాధారులుగా భారత హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్సింగ్, యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహై వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరు జాతీయ పతాకం ధరించి మార్చ్పాస్ట్లో పాల్గొంటారని భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి భారత్ 655 మంది భారీ బృందంతో బరిలోకి దిగుతున్నది. అందరితో సంప్రదింపులు చేసిన తర్వాత హర్మన్ప్రీత్, లవ్లీనాను ఎంపిక చేశామని భారత చెఫ్ డీ మిషన్ భూపేందర్సింగ్ బాజ్వా పేర్కొన్నారు.