న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై(75కి.), ఎల్డోరాకప్ చాంపియన్ అల్ఫియా పఠాన్(81ప్లస్), మీనాక్షి(52కి) ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తమతమ విభాగాలలో ఫైనల్స్కు చేరుకున్నారు. సెమీఫైనల్లోదక్షిణ కొరియాకు చెందిన సియాంగ్పై లవ్లీనా 5-0తో అలవోకగా గెలువగా, కజకిస్థాన్కు చెందిన కుంజిబయేవపై 5-0తో అల్ఫియా విజయం సాధించింది. మరోవైపు 52కిలోల సెమీస్ బౌట్లో మీనాక్షి 5-0తో మంగోలియా బాక్సర్ను మట్టికరిపించింది.