మేయర్ సాదిక్ ఖాన్
లండన్: ఐపీఎల్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో మరోమారు రుజువైంది. ఏకంగా వేరే దేశంలో ఎన్నికల ప్రచారంలోనూ ఈ అత్యుత్తమ లీగ్ పేరు వినిపిస్తున్నది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ఐపీఎల్ను లండన్కు తీసుకొస్తానంటూ మేయర్ సాదిక్ ఖాన్ హామీ ఇచ్చారు. అవును వచ్చే నెలలో జరుగనున్న లండన్ మేయర్ ఎన్నికల్లో తిరిగి ఎన్నికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సాదిక్ అందులో భాగంగానే ఈ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక లండన్లో ఐపీఎల్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని సాదిక్ శుక్రవారం అన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ లాంటి వారి ఆటను చూసేందుకు లండన్వాసులు ఎంతో ఇష్టపడతారని, ఐపీఎల్ వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.