IPL 2021 | ఐపీఎల్ -2021 టోర్నీలో ధోనీ సేన మళ్లీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ధోనీ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 173 పరుగుల విజయ లక్ష్య సాధనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఫాప్ డు ప్లెసిస్ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు.
కానీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 70, రూబిన్ ఊతప్ప 63 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా తనదైన శైలిని బ్యాట్ను ఝుళిపించారు. చివరి ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. అప్పటికి 16 పరుగులు చేశాడు. ఇక ధోనీ వరుసగా మూడు ఫోర్లు కొట్టి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఫైనల్స్లో చెన్నై ఆడనున్నది.
ఢిల్లీ క్యాపిటల్స్కు ఫైనల్స్కు చేరుకునేందుకు మరో అవకాశం ఉంది. సోమవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ).. కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలుపొందే జట్టుపై రెండో క్వాలిఫయర్ మ్యాచ్ బుధవారం జరుగుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో ఢిల్లీ క్యాపిటల్స్ తల పడుతుంది.