Lionel Messi : ఫిఫా వరల్డ్ కప్లో గ్రూప్ మ్యాచ్లు ముగిశాయి. కీలకమైన నాకౌట్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. ఇప్పటికే నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 16వ రౌండ్లో గెలిచి క్వార్టర్లోకి దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచే జట్టు ఏది? అనే ఊహగానాలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జెంటీనాతో కలిపి నాలుగు జట్లలో ఒకటి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని మెస్సీ జోస్యం చెప్పాడు. బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ తన ఫేవరెట్లని మెస్సీ తెలిపాడు. కామెరూన్తో ఓడిపోవడం తప్పితే బ్రెజిల్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఆ జట్టు వరల్డ్ కప్ ఫేవరేట్లలో ముందుంటుంది అని మెస్సీ అభిప్రాయపడ్డాడు.
16వ రౌండ్ మ్యాచ్లో ఆర్జెంటీనా 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి క్వార్టర్ బెర్త్ ఖాయం చేసుకుంది. సెమీస్ ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో ఆ జట్టు నెదర్లాండ్స్తో తలపడనుంది. టోర్నీ మొదటి మ్యాచ్లోనే సౌదీ అరేబియా చేతిలో 2-1తో అర్జెంటీనా ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో మెక్సికో, పోలండ్, ఆస్ట్రేలియాపై గెలిచింది. 16వ రౌండ్లో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గెలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరతాయి. అందులో గెలిచిన 4 జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెడతాయి. ఫైనల్కు చేరిన రెండు జట్లు డిసెంబర్ 18వ తేదీని జరిగే టైటిల్ పోరులో తలపడతాయి.