పారిస్: బార్సిలోనాతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ముగిసిన నేపథ్యంలో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ భవిష్యత్పై స్పష్టత వచ్చింది. ప్రముఖ ఫ్రెంచ్ ఫుట్బాల్ క్లబ్ ‘పారిస్ సెయింట్-జర్మన్’ (పీఎస్జీ)తో అతడు రెండేండ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2004 నుంచి ఈ సీజన్ వరకు బార్సిలోనాకు ఆడిన మెస్సీతో.. ఆ జట్టు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవలే కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పీఎస్జీ అతడికి భారీ మొత్తంలో (ఏడాదికి 35 మిలియన్ యూరోలు.. సుమారు రూ. 305 కోట్లు) చెల్లించనున్నట్టు సమాచారం.