టీ20 ప్రపంచ కప్లో భాగంగా అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన భారత్- ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ సమయంలో భారత జట్టు మెంటార్ మహేంద్రసింగ్ ధోనీ, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటోకు ‘ఇద్దరు దిగ్గజాలు. ఒక మధురమైన క్షణం’గా బీసీసీఐ పేర్కొంది. ఇక భారత కోచ్ రవిశాస్త్రి, పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ మ్యాథ్యూ హేడెన్, వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్తో మాట్లాడుతూ కనిపించారు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది.