కోల్కతా: కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్పై పోరాటానికి సహాయ పడేందుకు భారత ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్రౌండర్ లక్ష్మీ రతన్ శుక్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కామెంటరీ ద్వారా వచ్చిన మొత్తం జీతాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
14వ సీజన్లో శుక్లా బెంగాలీ కామెంటరీ బృందంలో ఉన్నాడు. కొవిడ్ సెకండ్ వేవ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు తనవంతుగా చిరుసాయాన్ని అందిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 3 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన రతన్..137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో రాజకీయాల నుంచి తప్పుకున్న శుక్లా అంతకుముందు 2016 నుంచి 2021 వరకు స్పోర్ట్స్, యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. హౌరా ఉత్తర నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.