పారిస్: భారత మేటి బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్( Lakshya Sen).. పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ ఎల్ సింగిల్స్ మ్యాచ్లో గాటెమాలే ప్లేయర్ కెవిన్ కార్డన్పై అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. కానీ ఆ ఫలితాన్ని రద్దు చేశారు. గాటెమాలే ప్లేయర్ గాయంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం.. లక్ష్యసేన్ విజయాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. అయితే గ్రూప్ ఎల్లో మరో రెండు మ్యాచ్లు సేన్ ఆడాల్సి ఉన్నది. దాని ఆధారంగా అతని ర్యాంక్ను నిర్ధారిస్తారు. జూలై 29వ తేదీన లక్ష్యసేన్.. జులియన్ కర్రాగితో ఆడనున్నాడు. కెవిన్ కార్డన్తో జరిగిన మ్యాచ్లో 21-8, 22-20 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు. 42 నిమిషాల పాటు ఆ మ్యాచ్ సాగింది. వరుస సెట్లలో అతను గెలుపొందాడు. తొలి సెట్ను కేవలం 14 నిమిషాల్లోనే సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో కార్డన్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఒలింపిక్స్లో సాత్విక్-చిరాగ్ మ్యాచ్ రద్దు అయ్యింది. మార్క్ లామ్ఫస్, మార్విన్ సీడెల్తో జరగాల్సిన ఆ మ్యాచ్ రద్దు అయ్యింది.
🇮🇳🚨 𝗧𝗼𝘂𝗴𝗵 𝗯𝗹𝗼𝘄 𝗳𝗼𝗿 𝗟𝗮𝗸𝘀𝗵𝘆𝗮! Kevin Cordon withdraws from #Paris2024 due to an elbow injury, virtually “deleting” Lakshya Sen’s victory over him.
🏸 The deletion means that Lakshya’s win over Kevin Cordon won’t count towards the standings and also means that… pic.twitter.com/wvEusDVlIP
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024