న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ చాంపియన్ను చిత్తు చేస్తూ ఇండియా ఓపెన్ టైటిల్ పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం లక్ష్యసేన్ 24-22, 21-17తో లోహ్ కీన్ యే (సింగపూర్)పై అద్భుత విజయం సాధించాడు. లక్ష్యసేన్కు ఇదే తొలి సూపర్-500 టైటిల్ కాగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మూడుసార్లు ప్రపంచ చాంపియన్ జోడీకి షాకిస్తూ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు సెమీఫైనల్తోనే సరిపెట్టుకుంది.