పారిస్: బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ సంచలన విజయం నమోదు చేశాడు. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇవాళ జరిగిన గ్రూప్ మ్యాచ్లో.. ప్రపంచ మూడవ ర్యాంక్ ప్లేయర్ జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 స్కోరు తేడాతో సేన్ విజయం సాధించాడు. తొలి గేమ్లో 2-8 తేడాతో వెనుకబడి ఉన్న సేన్.. ఆ తర్వాత అనూహ్యంగా తేరుకున్నాడు. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఆ గేమ్ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్ స్టార్టింగ్లో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఇండోనేషియాకు చెందిన జొనాథన్ ఆధిక్యం కోసం ప్రయత్నించినా.. సేన్ దూకుడుగా ఆడాడు.
ఆల్ ఇంగ్లండ్, ఆసియా చాంపియన్ అయిన క్రిస్టీని ఓడించేందుకు లక్ష్యసేన్ పట్టుదలను ప్రదర్శించాడు. గొప్ప మెచ్యూరిటీతో గేమ్పై పట్టు సాధించాడు. అయితే ప్రీ క్వార్టర్స్ లో హెచ్ ప్రణయ్తో సేన్ తలపడే అవకాశాలు ఉన్నాయి.
🇮🇳🔥 𝗟𝗔𝗞𝗦𝗛𝗬𝗔 𝗛𝗔𝗦 𝗗𝗢𝗡𝗘 𝗜𝗧! What a performance from Lakshya Sen against World No. 4, Jonatan Christie as he moves into the round of 16 in his maiden Olympic campaign. He won the match in straight games, 21-18 & 21-12.
🏸 After a slow start to the match, Lakshya Sen… pic.twitter.com/DEvk5btFGW
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024