జకార్తా: భారత షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్కు చేరుకున్నారు. గత పక్షం రోజుల్లో మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీలలో ఆరంభంలోనే వెనుదిరిగిన లక్ష్యసేన్ ఇక్కడ తొలి రౌండ్లో జపాన్ సంచలనం కొడై నరాఒకపై 21-12, 21-11తో సునాయాసంగా గెలిచాడు.
మహిళల సింగిల్స్లో సైనా 21-15,17-21,21-15తో చైనీస్ తైపీకి చెందిన పై యు పొపై చెమటోడ్చి నెగ్గింది. తదుపరి రౌండ్లో మలేషియాకు చెందిన ఎంగ్ ట్జె యాంగ్తో సేన్, చైనా ప్లేయర్లు జాంగ్ ఇ మన్-హాన్ యూ మధ్య విజేతతో సైనా తలపడుతుంది. మరోవైపు మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 10-21, 22-24 స్కోరుతో రుస్తావిటో సెషర్ హిరెన్(ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు.