లండన్: భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు ఛేజింగ్ చేస్తుంటే.. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు బాత్రూమ్లో దాక్కున్నట్లు పేసర్ కైల్ జెమీసన్ పేర్కొన్నాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న సమయంలో ప్రతీ బంతికి భారత అభిమానులు అరుస్తుంటే.. వికెట్ పడిందేమో అని భయపడ్డా. ఒక మ్యాచ్ చూసేందుకు గతంలో ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదు. ఆ టెన్షన్ తట్టుకోలేక నేను బాత్రూమ్లోకి వెళ్లా. ఆ శబ్దాలు వినిపించకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాను. విలియమ్సన్, టేలర్ గొప్ప సంయమనంతో పని పూర్తి చేశారు’ అని జెమీసన్ వెల్లడించాడు.