చెన్నై: మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్కు.. యువ ఓపెనర్ పృథ్వీషా మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్-‘ఎ’తో ఆదివారం జరిగిన అనధికారిక రెండో వన్డేలో భారత్-‘ఎ’ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్-‘ఎ’ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. కార్టర్ (72), రచిన్ రవీంద్ర (61) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్-‘ఎ’ 34 ఓవర్లలో 6 వికెట్లకు 222 రన్స్ చేసింది. పృథ్వీ షా (48 బంతుల్లో 77; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (37), రుతురాజ్ గైక్వాడ్ (30), రాణించారు.