KTR : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫైనల్కు దూసుకెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సైతం ఆరెంజ్ ఆర్మీకి అభినందనలు తెలియజేశారు. టైటిల్ పోరులో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అందులో..’సన్రైజర్స్ జట్టుకు అభినందనలు. ఆల్ ది బెస్ట్’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ పోస్ట్కు భారీగా లైక్స్ వచ్చాయి.
పదిహేడో సీజన్లో రికార్డు స్కోర్లతో ప్రకంపనలు రేపిన సన్రైజర్స్ రెండో టైటిల్ వేటకు సిద్ధమైంది. ఆదివారం మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను ఢీ కొట్టనుంది. క్వాలిఫయర్ 1లో కోల్కతా చేతిలో చిత్తైన హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్ 2లో గర్జించింది.
Congratulations and All the best #SunRisersHyderabad in the #IPL2024 https://t.co/X3Jv7B8QKz
— KTR (@KTRBRS) May 25, 2024
మే 24న చెపాక్లో జరిగిన మ్యాచ్లో ఫేవరెట్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)పై కమిన్స్ సేన అద్భుత విజయం సాధించింది. 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని ఔరా అనిపించింది. ఇంప్యాక్ట్ ప్లేయర్ షాబాద్ అహ్మద్(3/23), అభిషేక్ శర్మ(22/4)లు తిప్పేయగా.. రాజస్థాన్ టాప్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ధ్రువ్ జురెల్(56 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా సంజూ సేన చివరకు 36 రన్స్తో ఓడిపోయింది.
Posing with the latest additions to their award collections 😁🏆#PlayWithFire #SRHvRR pic.twitter.com/uxFq7TjTFz
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2024