న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఏపీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ 32 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించాడు. రిషబ్ పంత్ అందుబాటులో లేని సమయంలో కేఎస్ భరత్ టెస్టు జట్టులోకి వచ్చాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఏడు టెస్టులు మ్యాచ్లు ఆడిన భరత్.. బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
కేవలం 221 పరుగులు మాత్రమే సాధించాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టు తరఫున సుదీర్ఘ కాలం పాటు స్థిరమైన ప్రదర్శన ఇచ్చిన భరత్.. 113 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 6102 రన్స్ చేశాడు. ఐపీఎల్లో పది మ్యాచ్లు ఆడాడు. దేశం తరఫున ఆడటం తన జీవితంలో దక్కిన అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్న భరత్ ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ సంఘం, తన కెప్టెన్లు కోహ్లీ, రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు.