న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్కు కొరియా ఓపెన్లో నిరాశ ఎదురైంది. చక్కటి ప్రదర్శనతో సెమీఫైనల్స్కు చేరిన వీరిద్దరూ వరుస గేమ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం మూడో సీడ్ పీవీ సింధు 14-21, 17-21తో రెండో సీడ్ అన్ సెయాంగ్ (కొరియా) చేతిలో ఓడింది. 20 ఏండ్ల సెయాంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో.. తెలుగమ్మాయి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 19-21, 16-21తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో కొరియా ఓపెన్లో భారత్ పోరాటం ముగిసినైట్లెంది.