న్యూఢిల్లీ: మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ, మరో బ్యాటర్ రిషబ్ పంత్.. ఇద్దరు మళ్లీ రంజీ(Ranji Trophy) జట్టు ప్రాబబుల్స్లో ఉన్నారు. ఢిల్లీ జట్టు తరపున రిలీజైన 84 మంది జాబితాలో ఆ ఇద్దరు బ్యాటర్ల పేర్లు కూడా ఉన్నాయి. నిజానికి రంజీ సీజన్లో ఇద్దరూ అందుబాటులో లేకున్నా.. ఆ ఇద్దర్ని మాత్రం ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్లో చోటు క్పలించారు. ఇశాంత్ శర్మకు ఆ లిస్టులో చోటు దక్కలేదు. మయాంక్ యాదవ్ ఆ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారి 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఘజియాబాద్లో అతను యూపీ జట్టుతో తలపడడ్డాడు. పంత్ కూడా చివరిసారి కోవిడ్కు ముందు రంజీల్లో ఆడాడు. ప్రోటోకాల్ ప్రకారం లిస్టును తయారు చేశామని, ఒకవేళ వాళ్లు కావాలంటే రంజీల్లో ఆడుకోవచ్చు అని ప్రాబబుల్స్ లో పేర్లు పెట్టినట్లు డీడీసీఏ అధికారి తెలిపారు.