Virat Kohli | భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 8 పరుగుల వద్ద ఔట్ కాగా.. తాజాగా క్రీజులోకి వచ్చిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డకౌట్గా (0) వెనుదిరిగాడు. ఎనిమిది బంతులు ఆడిన కోహ్లీ స్టార్క్ బౌలింగ్లో కనోలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 21 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. కోహ్లీ వికెట్ అనంతరం శ్రేయాస్ అయ్యార్ తాజాగా క్రీజులోకి వచ్చాడు.