అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువెళ్లాడు. పిచ్లోకి వెళ్లిన అతను విరాట్ కోహ్లీని పట్టుకున్నాడు. అరెస్టు చేసిన ఆ వ్యక్తిని వెన్ జాన్సన్గా గుర్తించారు. చాంద్కేడా పోలీసు స్టేషన్లో అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు. విరాట్ కోహ్లీకి వీరాభిమానిని(Kohli Fan) అతను చెబుతున్నాడు. అందుకే మ్యాచ్ను చూసేందుకు వచ్చినట్లు చెప్పాడు. రెయిలింగ్ను క్రాస్ చేసి అతను కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లోకి ఎంటరయ్యాడు. ఐపీసీలోని 332, 447 సెక్షన్ల కింద అతనిపై కేసును బుక్ చేసినట్లు అహ్మాదాబాద్ పోలీసులు తెలిపారు.
సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిన వెన్ జాన్సన్.. మ్యాచ్ పిచ్లోకి దూసుకెళ్లాడు. భారత ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్ ముందు వైపు ‘పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’ అని, వెనుక ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉంది. అలాగే పాలస్తీనా జెండా రంగులను పోలిన మాస్క్ను అతడు ధరించాడు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు వ్యతిరేకంగా ఈ సంఘటనకు పాల్పడ్డాడు.
ఇవాళ అహ్మాదాబాద్ క్రైం బ్రాంచ్కు ఆ వ్యక్తిని తీసుకువచ్చారు.
Gujarat | A case has been registered against the person who entered the ground unauthorized during the India-Australia World Cup final match. The case has been registered against a person named WEN Johnson at Chandkheda Police Station, Ahmedabad. The accused described himself as… https://t.co/2mhBNUzCPt
— ANI (@ANI) November 19, 2023