IPL 2023 : మొహాలీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( Royal Challengers Bangalore)ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ కింగ్స్పై 24 పరగులు తేడాతో గెలిచింది. దాంతో, ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. మొదట కెప్టెన్ డూప్లెసిస్(84), విరాట్ కోహ్లీ(59) వీర బాదుడు బాదడంతో ఆర్సీబీ 174 పరుగులు చేసింది. ఆ తర్వాత సిరాజ్ బంతితో హడలెత్తించాడు. నాలుగు వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. దాంతో పంజాబ్ 150 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(46), ఆఖర్లో జితేశ్ శర్మ(41) పోరాడారు. పంజాబ్కు ఇది మూడో ఓటమి.
లక్ష్య ఛేదనలో పంజాబ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.. రెండో బంతికే ఓపెనర్ అథర్వ తైడే(4)ను సిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. వనిందు హసరంగ తన మొదటి ఓవర్లోనే మాథ్యూ షార్ట్(8)ను బౌల్డ్ చేశాడు. డేజంరస్ లివింగ్స్టోన్(2)ను ఔట్ చసి , షారుక్ ఖాన్ విఫలయ్యాడు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(46), సామ్ కరన్(7) ఇన్నింగ్స్ నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన కీపర్ జితేశ్ శర్మ(41), హర్ప్రీత్ బ్రార్(13) ధాటిగా ఆడారు. వీళ్లు ఎనిమిదో వికెట్కు 41రన్స్ రాబట్టారు. ఈ జోడిని సిరాజ్ విడదీయంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో జితేశ్ ఇచ్చిన క్యాచ్ను షహబాజ్ అహ్మద్ పట్టకున్నాడు. దాంతో, పంజాబ్ 150 పరుగులకు ఆలౌటయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 2, పార్నెల్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో జట్టును విజయం వైపు నడిపించిన సిరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
𝘽𝙖𝙘𝙠 𝙩𝙤 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙬𝙖𝙮𝙨 😎@RCBTweets clinch a 24-run victory over #PBKS in Mohali 🙌🙌
Scorecard ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/RGFwXXz5eC
— IndianPremierLeague (@IPL) April 20, 2023
మొహాలీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు కెప్టెన్ డూప్లెసిస్(84), విరాట్ కోహ్లీ(59) రెచ్చిపోయారు. దాంతో, 4 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 174 పరుగులు చేసింది. శుభారంభం లభించినా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఫామ్ కొనసాగించిన కోహ్లీ, డూప్లెసిస్ అర్థ శతకాలతో చెలరేగారు. వీళ్ల జోరు చూస్తే ఒక దశలో ఆర్సీబీ రెండొందలు కొట్టేలా కనిపించింది. కానీ, పంజాబ్ బౌలర్లు పుంజుకొని ఆర్సీబీని కట్టడి చేశారు. అయితే… ఒకే ఓవర్లోలో వరుస బంతుల్లో హర్ప్రీత్ బ్రార్ కోహ్లీ, మ్యాక్స్వెల్(0)ను ఔట్ చేశాడు. కీపర్ జితేశ్ శర్మ అద్భుత క్యాచ్ పట్టడంతో కోహ్లీ వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గింది. దినేశ్ కార్తిక్(7) మరోసారి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు, నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.