దుబాయ్: భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఐసీసీ వన్డే ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మాజీ కెప్టెన్ కోహ్లీ 836 పాయింట్లతో రెండో ర్యాంక్లో కొనసాగుతుండగా, పాక్ సారథి ఆజమ్ (873) టాప్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కోహ్లీ 116 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లో ఆడకపోయినా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ (801) మూడో స్థానంలో స్థిరంగా ఉన్నాడు. బౌలింగ్లో బుమ్రా ఏడో ర్యాంక్లో.. ఆల్రౌండర్ ర్యాంకుల్లో జడేజా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.