ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో 22వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రతీ బంతిని బౌండరీ బాదాలనే కసితో అతడి బ్యాటింగ్ సాగుతోంది. మరో ఎండ్లో దీపక్ హుడా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. శివమ్ దూబే వేసిన 13వ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన హుడా శ్రేయస్ గోపాల్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో వరుసగా రెండు ఓవర్లలో పంజాబ్ 20 రన్స్ రాబట్టింది. 14 ఓవర్లకు పంజాబ్ 2 వికెట్లకు 150 పరుగులు చేసింది. రాహుల్(54), హుడా(39) క్రీజులో ఉన్నారు.