టీమిండియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో.. కేఎల్ రాహుల్ భారీ షాట్ కొట్టబోయి మిచెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్.. 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు. 5.5 ఓవర్లలో భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 35. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు.