సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతున్నాడు. తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన అతను.. తన రెండో ఓవర్ చివరి బంతికి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఉమ్రాన్ షార్ట్ బాల్ వేస్తాడని అనుకున్న శ్రేయాస్.. దానికి రెడీగా నిలబడ్డాడు. అయితే ఉమ్రాన్ షార్ట్ బాల్ వేయలేదు.
ప్యాడ్ల మీదకు వచ్చేలా బంతిని విసిరాడు. దాంతో కొంత తడబడిన శ్రేయాస్.. ఏదైతే అదైందని బంతిని పుల్ చేశాడు. ఈ క్రమంలో డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠీ డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్తో మైదానం వీడాడు. దీంతో కోల్కతా జట్టు 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.