సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు మరో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు రింకూ సింగ్ (5) మైదానం వీడాడు. నటరాజన్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి అతను అవుటయ్యాడు. నటరాజన్ వేసిన బంతి రింకూ ప్యాడ్లను తాకింది. అతను అప్పీల్ చేయగా.. కొంచెం టైం తీసుకున్న అంపైర్ అవుటిచ్చాడు.
దాంతో రివ్యూ కోరాలా? వద్దా? అని బిల్లింగ్స్తో చర్చించిన రింకూ.. టైం అయిపోయిన తర్వాత రివ్యూ కోరాడు. అయితే అప్పటికే టైం అయిపోవడంతో అతను పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 96 పరుగులతో నిలిచింది.