రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ కష్టాల్లో పడిపోయింది. స్టార్ ఓపెనర్ బట్లర్ (22) త్వరగా పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత కెప్టెన్ సంజూ శాంసన్ భుజాలపై పడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించిన అతను మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే అతనికి సహకారం అందించాల్సిన కరుణ్ నాయర్ (13) నిరాశపరిచాడు.
అనుకూల్ రాయ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు. అనుకూల్ వేసిన షార్ట్ బాల్ను ఆడేందుకు ప్రయత్నించిన కరుణ్ నాయర్ బంతిని గాల్లోకి లేపాడు. డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రింకూ సింగ్ ముందుకొచ్చి చక్కని క్యాచ్ అందుకోవడంతో నాయర్ పెవిలియన్ చేరాడు. దీంతో యువ ఆటగాడు రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు.