టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు కేకేఆర్ పేసర్ ఉమేష్ యాదవ్ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ (1)ను అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ గాడి తప్పుతుందని కోల్కతా భావించింది. కానీ మూడో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ భానుక రాజపక్స (9 బంతుల్లో 31) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
ఉమేష్ వేసిన మూడో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన రాజపక్స.. తర్వాతి ఓవర్లో శివమ్ మావికి చుక్కలు చూపించాడు. ఫోర్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే టైమింగ్ సరిగా కుదరకపోవడంతో ఎక్స్ట్రా కవర్ వైపు కొట్టాడు. అక్కడకు పరిగెత్తుకొచ్చిన సౌతీ సులభంగా అందుకోవడంతో రాజపక్స ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 43/2 స్కోరుతో నిలిచింది.