పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు కెప్టెన్ మయాంక్ (1)ను పెవిలియన్ చేర్చిన ఉమేష్ యాదవ్.. ఆ జట్టును మరోసారి దెబ్బ కొట్టాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ను ఆదుకునేలా కనిపించిన లియామ్ లివింగ్స్టన్ (19)ను తొమ్మిదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు.
ఫుల్ లెంగ్త్లో వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన లివింగ్స్టన్ లాంగాఫ్ బౌండరీకి అడుగు దూరంలో సౌతీకి చిక్కాడు. దీంతో పంజాబ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే విండీస్ ఆల్రౌండర్ సునీల్ నరైన్.. పంజాబ్కు మరో షాకిచ్చాడు. యువ ఆటగాడు రాజ్ బవా (11)ను క్లీన్బౌల్డ్ చేశాడు.
అంతకుముందు బంతికే బౌండరీ బాదిన బవా.. తర్వాతి బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. నరైన్ వేసిన క్విక్ డెలివరీని ఆడేందుకు ప్రయత్నించాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ను తప్పించుకున్న ఆ బంతి.. అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్స్టంప్కు తగిలింది. దీంతో బవా పెవిలియన్ చేరాడు. ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి 85/5 స్కోరుతో నిలిచింది.