న్యూఢిల్లీ: కోల్కతా నైట్ రైడర్స్ క్రికెటర్లు(KKR Players) తీవ్ర కష్టాలు పడ్డారు. లక్నోలో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్లో కోల్కతా వెళ్లిన ఆ బృందానికి ఊహించని షాక్ తగిలింది. వెదర్ అనుకూలంగా లేకపోవడంతో.. తొలుత ఆ విమానాన్ని గువాహతికి మళ్లించారు. ఆ తర్వాత మళ్లీ కోల్కతాకు వచ్చినా.. అప్పుడు కూడా వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆ రాత్రి పూట విమానాన్ని వారణాసికి మళ్లించారు. ఇక రాత్రాంతా ప్లేయర్లు వారణాసిలోనే గడిపారు. ఇవాళ ఉదయం కేకేఆర్ ప్లేయర్లు.. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.
KKR’s players visit at the Sri Kashi Vishwanath Temple in Varanasi.🙏 (KKR Vibe). pic.twitter.com/Kqef4avjXA
— Tanuj Singh (@ImTanujSingh) May 7, 2024
ఆదివారం మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో కేకేఆర్ ప్లేయర్లు స్వంత గూటికి పయనం అయ్యారు. అయితే 7.45 నిమిషాలకు కోల్కతాకు చేరుకోవాల్సి ఉంది. కానీ వెదర్ బాగలేకపోవడంతో ఆ విమానాన్ని గువాహతికి తరలించారు. గువాహతి నుంచి రాత్రి 11 గంటలకు కోల్కతాకు విమానం వెళ్తుందని ఓ ప్రకటన చేశారు. కానీ మళ్లీ వెదర్ బ్యాడ్గా ఉండడంతో విమానాన్ని దారి మళ్లించారు. వారణాసిలో విమానం రాత్రి 1.15 నిమిషాలకు ల్యాండ్ అయ్యినట్లు కేకేఆర్ మేనేజ్మెంట్ తెల్లవారుజామున 3 గంటలకు సమాచారం ఇచ్చింది. వారణాసిలోనే ఓవర్నైట్ స్టే ఉంటుందని పేర్కొన్నది.
కేకేఆర్ జట్టు మే 11వ తేదీన ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్తో ఆడనున్నది. మే 13వ తేదీన అహ్మాదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో, మే 19వ తేదీన గువాహతిలో రాజస్థాన్ రాయల్స్తో ఆడనున్నది.ఇవాళ ఉదయం కేకేఆర్ ప్లేయర్లు.. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.