న్యూఢిల్లీ: ప్రొ పంజాలీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ 17-11 తేడాతో ముంబై మజిల్పై అద్భుత విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం 57 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. పోరు విషయానికొస్తే..
అండర్కార్డ్లో షాహిల్ హుస్సేన్(70కి), మధుర(65కి) ప్రత్యర్థులపై గెలువగా, షోయబ్ అక్తర్(60కి)ఓడిపోయాడు. మెయిన్కార్డ్లో సిద్దార్థ్ మలాకర్(90కి), మధుర(65కి) విజయాలు సాధించగా, బుట్టాసింగ్(స్పెషల్) పరాజయం పాలయ్యాడు. శుక్రవారం లుధియానా లయన్స్తో హైదరాబాద్ తలపడుతుంది.