Swiss Open | బాసెల్: స్విస్ ఓపెన్లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-18తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై అలవోక విజయం సాధించాడు. మరో సింగిల్స్లో లక్ష్యసేన్ 21-19, 15-21, 21-11తో లియాంగ్ జున్ హవో(మలేషియా)పై గెలిచాడు.
ఇటీవల ముగిసిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సెమీస్ చేరిన లక్ష్యసేన్..మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. మహిళల డబుల్స్లో తనీషా క్యాస్ట్రో, అశ్విని పొనప్ప జోడీ 21-18, 18-21, 21-19తో మెలిసా ట్రయాస్, రాచెల్ అలీస్సా ద్వయం(ఇండోనేషియా)పై గెలిచింది. సింగిల్స్లో పీవీ సింధు 21-12, 21-13తో పోర్నిచ చోయిపై విజయం సాధించింది. ప్రియ, శృతి మిశ్రా జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది.