Khelo India | హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మహిళల 200మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్లో యువ స్విమ్మర్ శ్రీనిత్య సాగి 2:25:83సెకన్ల టైమింగ్తో రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పాలక్ అశుతోష్(మహారాష్ట్ర), నైశా(కర్ణాటక) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.