న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. భారత్లో కరోనా పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోందని పీటర్సన్ ట్విటర్లో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని జట్లలోని పలువురు ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఐపీఎల్ 2021ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత పీటర్సన్ ట్వీట్ చేశారు.
తాను ఎంతగానే ప్రేమించే దేశంలో ఈ పరిస్థితులు చూస్తుంటే నా గుండె పగిలిందంటూ పీటర్సన్ వ్యాఖ్యానించాడు. కరోనా సమయంలో ప్రజల కష్టాలు, హృదయ విదారక ఘటనలు అందరినీ కలచివేస్తోందన్నారు. త్వరలోనే మహమ్మారి సంక్షోభం నుంచి దేశ ప్రజలు బయట పడతారని కెవిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2021 సీజన్లో పీటర్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
India – it’s heartbreaking to see a country I love so much suffering! 😢
— Kevin Pietersen🦏 (@KP24) May 4, 2021
You WILL get through this!
You WILL be stronger coming out of this!
Your kindness & generosity NEVER goes unnoticed even during this crisis! 🙏🏽#IncredibleIndia ❤️