న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్కు చెందిన యువ స్కీయర్ ఆరిఫ్ఖాన్కు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కింది. వచ్చే నెల ఫిబ్రవరిలో బీజింగ్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఆరిఫ్ఖాన్ను టాప్స్ కోర్ గ్రూపులోకి తీసుకుంటున్నట్లు కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం పేర్కొంది. వింటర్ ఒలింపిక్స్లో రెండు పోటీల(స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్)కు బెర్తు దక్కించుకున్న తొలి భారతీయుడిగా నిలిచిన ఆరిఫ్ శిక్షణ కోసం రూ.17.46 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో శిక్షణ పొందుతున్న ఈ 31 ఏండ్ల కశ్మీర్ యువ అథ్లెట్ మెగా టోర్నీకి యూరోప్లో ట్రైనింగ్, సామగ్రి కోసం ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్లు క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి.