హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనీస్ తైపీ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత యువ ప్లేయర్ గంటా సాయికార్తీక్, హువాంగ్ సంగ్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో కార్తీక్, హువాంగ్ ద్వయం 2-6, 6-3, 10-8తో జపాన్ జోడీ ఒచీ మకాటో, తకెరు యుజుకిటోపై అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి తొలి సెట్ కోల్పోయినా..వెనుకకు తగ్గకుండా పుంజుకుని వరుస సెట్లలో మ్యాచ్ను తమ వశం చేసుకున్నారు.