హైదరాబాద్: ఈనెల 20, 21 తేదీల్లో జాతీయ కరాటే చాంపియన్షిప్ను నిర్వహిస్తున్నామని టోర్నీ నిర్వాహక కార్యదర్శి రాజేశ్వరీ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనిక్ కరాటే సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా ఈ కరాటే కలాడి(Karate Kiladi) సిరీస్ ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ జాతీయ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి రెండువేల మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇప్పటికే 15 రాష్ట్రాల నుంచి ఎంట్రీలు అందాయని, ఆయా రాష్ట్రాల సీనియర్ కోచ్లు, మెడలిస్టులను ఈ సందర్భంగా సన్మానిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది జనవరిలో ఈ కరాటే కిలాడి సిరీస్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొనదలచిన క్రీడాకారులు మిగితా వివరాలకు నిర్వాహకు కార్యదర్శి రాజేశ్వరీ చౌహాన్(9030941347)ను సంప్రదించగలరు. టోర్నీ బ్రౌచర్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.