Srilanka Cricket : టీ20 వరల్డ్కప్ కోసం ఆతిథ్య శ్రీలంక స్క్వాడ్ను ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాడు ధనంజయ డిసిల్వాకు షాకిస్తూ కమిందు మెండిస్కు జై కొట్టారు సెలెక్టర్లు. దసున్ శనక సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం ప్రకటించారు. వీరిలో ఐపీఎల్ స్టార్లు పథిరన, థీక్షణ ఉన్నారు. అయితే.. పేసర్ ప్రమోద్ మధుషాన్కు చోటు దక్కలేదు.
మాజీ ఛాంపియన్ శ్రీలంక రెండో టైటిల్ లక్ష్యంగా పటిష్టమైన స్క్వాడ్తో బరిలోకి దిగుతోంది. వలర్డ్కప్ సన్నాహక టోర్నికి చరిత అసలంకను తప్పించి దసున్ శనకు పగ్గాలు అప్పగించిన సెలెక్టర్లు.. నిలకడగా నిలకడగా రాణిస్తున్న వాళ్లకే ప్రాధాన్యమిచ్చారు. బ్యాటింగ్ యూనిట్లో పథుమ్ నిశాంక, మిశార, మెండిస్ ద్వయం కీలకం కానున్నారు.
Sri Lanka have recalled Kamindu Mendis and dropped Dhananjaya de Silva from their 15-man squad for the T20 World Cup 🔁 pic.twitter.com/UyIVMiwat6
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2026
ఆల్రౌండర్ కోటాలో హసరంగ, వెల్లలాగే చోటు దక్కించుకోగా.. ప్రత్యేక స్పిన్నర్గా థీక్షణ ఎంపికయ్యాడు. పేస్ దళానికి పథిరన నాయకత్వ వహించనుండగా.. ఇషాన్ మలింగ, చమీర అతడితో బంతిని పంచుకోనున్నారు. అయితే.. ఇంగ్లండ్తో మ్యాచ్లో ఎముక స్థానభ్రంశం చెందడంతో ఇషాన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశముంది.
శ్రీలంక టీ20 వరల్డ్కప్ స్క్వాడ్ : దసున్ శనక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కమిల్ మిశార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జెనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియనగే, పవన్ రత్ననాయకే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ థీక్షణ, చమీర, పథిరన, ఇషాన్ మలింగ.
2014లో పొట్టి ట్రోఫీని ముద్దాడిన శ్రీలంక ఈసారి స్వదేశంలో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఆరంభ పోరులో ఫిబ్రవరి 8న ఐర్లాండ్తో లంక తలపడనుంది. ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వేతో శనక బృందం లీగ్ దశ మ్యాచ్లు ఆడనుంది.