Kamindu Mendis : శ్రీలంక యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్(Kamindu Mendis) క్రికెట్ చరిత్రలో రికార్డులు తిరగరాశాడు. 147 ఏండ్లలో ఎవరివల్లా కానీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి రెండు ఇన్నింగ్స్ల్లో శతకాలు బాదిన తొలి క్రికెటర్గా చరిత్రపుటల్లోకెక్కాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో కమిందు ఈ ఫీట్ సాధించాడు.
తొలి ఇన్నింగ్స్లో 102 రన్స్ కొట్టిన కమిందు.. రెండో ఇన్నింగ్స్లోనూ రెచ్చిపోయాడు. బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ శతకం బాదేశాడు. 164 రన్స్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ధనంజయ డిసిల్వా(108) కూడా సెంచరీతో మెరిశాడు. దాంతో, లంక రెండో ఇన్నింగ్స్లో 418 పరుగులు చేసింది.
Spectacular back-to-back centuries from Kamindu Mendis in just his second Test have put Sri Lanka in the driver’s seat in Sylhet 👊#BANvSL | WTC25 📝: https://t.co/MBpKJssuPp pic.twitter.com/cKZE84lOry
— ICC (@ICC) March 24, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించి బంగ్లాను పేసర్ విష్వా ఫెర్నాండో వణికించాడు. మూడు కీలక వికెట్లు తీసి ఆతిథ్య జట్టును కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 47 రన్స్ కొట్టింది. మొమినుల్ హక్(7 నాటౌట్), తైజుల్ ఇస్లాం(6 నాటౌట్లు) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే బంగ్లాకు ఇంకా 464 పరుగులు అవసరం. మరోవైపు లంకు ఐదు వికెట్లు కావాలి.