Mohammad Kaif : ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఫామ్ భారత జట్టును కలవర పెడుతోంది. యార్కర్ కింగ్గా ప్రశంసలు అందుకున్న అతను నో బాల్స్తో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కీలక బౌలర్గా ఎదుగుతున్న అతను నో బాల్స్తో జట్టుకు నష్టం చేస్తున్నాడు. అయితే.. అతను నో బాల్స్ వేయడానికి లాంగ్ రనప్ ప్రధాన కారణం అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. మొదటి టీ20 మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘అర్ష్దీప్ ఈమధ్య తరచూ నో బాల్స్ వేయడానికి కారణం అతని బౌలింగ్ యాక్షన్. అతను లాంగ్ రనప్ వల్లనే గీత దాటుతున్నాడు. దాంతో నో బాల్స్ వేస్తున్నాడు. అంతేకాదు ఎక్కువ దూరం పరుగెత్తుతూ అతను తన శక్తిని వృథా చేస్తున్నాడు’ అని చెప్పాడు. ఈ యంగ్ బౌలర్ మెరుగవ్వడానికి ఏం చేయాలో కూడా కైఫ్ సూచించాడు. అర్ష్దీప్ మంచి బౌలర్. అయితే.. రాంచీలో అతనికి చేదు అనుభవం ఎదురైంది. అతడు బౌలింగ్ బేసిక్స్ మీద దృష్టి పెట్టాలని, ప్రశాంతంగా ఉండాలని కైఫ్ తెలిపాడు.
మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూడా కైఫ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘కైఫ్ చెప్పినట్టే.. అర్ష్దీప్ లాంగ్ రనప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత దూరం రన్ చేయాలి అనేది బౌలర్ నిర్ణయించుకోవాలి. మీరు ఎదుగుతున్న ఫాస్ట్ బౌలర్ అయితే.. శరీరంలో అంత శక్తి ఉండదు. కాబట్టి లాంగ్ రనప్ అవసరమవుతుంది’ అని బంగర్ అన్నాడు. రాంచీలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20లో చివరి ఓవర్ను అర్ష్దీప్ నో బాల్తో ప్రారంభించాడు. ఆ ఓవర్లో మిచెల్ చెలరేగిపోయాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో 21 రన్స్ వచ్చాయి. న్యూజిలాండ్ 21 రన్స్ తేడాతో గెలుపొందడంలో ఆఖరి ఓవర్ కీలకమైంది. రెండో టీ20 రేపు లక్నోలో జరగనుంది.