RR vs GT : అహ్మదాబాద్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) అర్ధ శతకాలతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశారు. వైభవ్ సూర్యవంశీ(31)తో కలిసి మెరుపు ఆరంభమిచ్చిన యశస్వీ.. జురెల్ జతగా మరింత రెచ్చిపోయాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(18) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ రెండొందల మార్క్ అందుకుంది. తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో కంగుతిన్న గుజరాత్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రెండొందల స్కోర్ మామూలైపోయింది. తొలి మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్మనిపించిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి 210 పరుగులతో చెలరేగింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(31), యశస్వీ జైస్వాల్(55)లు అదిరే ఆరంభమిచ్చారు. పోటాపోటీగా బౌండరీలు బాదిన ఈ ద్వయం పవర్ ప్లేలోనే స్కోర్ 60 దాటించింది.
Dynamic Dhruv Jurel 💪
🎥 Glimpses of his terrific knock of 7⃣5⃣(42) 👏
Scorecard ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR | @rajasthanroyals | @dhruvjurel21 pic.twitter.com/dC4f5jRT7T
— IndianPremierLeague (@IPL) April 4, 2026
ప్రమాదకరమైన వైభవ్ను రషీద్ ఖాన్ ఔట్ చేసి గుజరాత్కు తొలి బ్రేకిచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్(75) అసలైన టీ20 ఆటతో రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన జురెల్ అర్ధశతకంతో చెలరేగగా.. ఆఖర్లో హిట్మైర్(18 నాటౌట్) మెరుపులతో రాజస్థాన్ స్కోర్ 200 దాటింది. సిరాజ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా(7 నాటౌట్) ఫోర్గా మలిచాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 210 పరుగులు చేసింది.