IND vs SL : కొలంబో టెస్టులో ధ్రువ్ జురెల్(106 నాటౌట్) శతకంతో చెలరేగాడు. ఏడో స్థానంలోశ్రీలంకపై వంద కొట్టిన రెండో భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. లంచ్ తర్వాత దూకుడు పెంచిన ఈ కుర్రాడికి టెస్టుల్లో ఇది రెండో శతకం. రిషభ్ పంత్(63) తో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడిన జురెల్ శతక భాగస్వామ్యంతో భారీ స్కోరందించాడు.
రెండో రోజు క్రీజునంటుకున్న ధ్రువ్ జురెల్(106 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. టీ బ్రేక్ ముందే 95 పరుగులతో ఉన్న అతడు.. వర్షం అంతరాయం అనంతరం మూడంకెల స్కోరందుకున్నాడు. అసితా ఫెర్నాండో ఓవర్లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్లో రెండో వంద నమోదు చేశాడీ బ్యాటర్.
💯 𝙛𝙤𝙧 𝘿𝙝𝙧𝙪𝙫 𝙅𝙪𝙧𝙚𝙡! 🫡
A fantastic knock from him to bring up his second hundred in Test cricket! 🙌 🙌
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/D9fYDRpAqG
— BCCI (@BCCI) August 24, 2026
తద్వారా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తర్వాత లంకపై ఏడో స్థానంలో సెంచరీ బాదిన ఆటగాడిగా జురెల్ రికార్డు సృష్టించాడు. 2017లో పల్లెకెలె స్టేడియంలో పాండ్యా 108 పరుగులతో రాణించాడు. ఏడో స్థానంలో లేదా లోయర్ ఆర్డర్లో నితీశ్ కుమార్ రెడ్డిదే చివరి శతకం.2024 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ టెస్టులో రెడ్డి 114 రన్స్ కొట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జురెల్ సెంచరీతో ఆపద్బాందవుడిలా అవతరించాడు.