హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ పూల్ వేదికగా జరుగుతున్న 8వ జూనియర్, సబ్జూనియర్ అంతర్జిల్లాల చాంపియన్షిప్లో యువ స్విమ్మర్ జోనా షిజు ఐదు పసిడిపతకాలతో మెరిసింది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన జోనా వేర్వేరు విభాగాల్లో పతకాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న జోనా..బాలికల 50మీ, 100మీ, 200మీ ఫ్రీ స్టయిల్, 50మీ, 100మీ బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్లలో అగ్రస్థానంలో నిలిచి ఆకట్టుకుంది.