లండన్: ఇండియన్ టీమ్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేషన్తో కలిసి లండన్లో హాయిగా విహరిస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఖాళీ సమయం దొరకడంతో యూకేలో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భార్య సంజనతో కలిసి ఇటలీ, స్పెయిన్ మధ్య జరిగిన యూరో సెమీఫైనల్ మ్యాచ్ చూశాడు. లండన్లోని వింబ్లే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. స్టేడియంలో ఉన్న ఫొటోను సంజనా షేర్ చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన ఇటలీ.. ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. షూటౌట్లలో ఇటలీ 4-2తో విజయం సాధించింది. యూరోలో ఇటలీకి ఇది వరుసగా 16వ విజయం కావడం విశేషం.