హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. మూడు ప్యానెళ్ల నుంచి గెలిచిన ఆరుగురు కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పారు. గతంలో పనిచేసిన వారి సలహాలు తీసుకుంటామన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి భారత జట్టులో అధిక మంది ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్, వరంగల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ నెల 20న జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో జగన్మోహన్రావు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు కొనసాగిన అధ్యక్ష పోరులో తన సమీప అభ్యర్థి అమర్నాథ్పై ఒక్క ఓటు తేడాతో ఆయన గెలుపొందారు.