ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణించాడు. దీంతో అతనికి కచ్చితంగా టీ20 జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతని పేరు లేదు. దీంతో అంతా షాకయ్యారు.
అయితే ఇలా శిఖర్ ధావన్ను ఎంపిక చేయకూడదనే నిర్ణయం హెడ్ కోచ్ ద్రావిడ్దేనని తెలుస్తోంది. టీ20ల్లో బాగా ఆడుతున్న యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని రాహుల్ అన్నాడని, దానికి తామంతా అంగీకరించామని ఒక బీసీసీఐ ఉన్నతాధికారి చెప్పాడు. ఇలా టీ20 జట్టులో ఎంపిక చెయ్యలేదనే విషయాన్ని శిఖర్కు స్వయంగా రాహులే చెప్పాడని ఆయన తెలిపారు.