ITF Doubles | గురుగ్రామ్: భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా.. ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో శనివారం అంకిత రైనా-జిబెక్ (కజకిస్థాన్) జంట 6-4, 6-2 కాబజ్ అవాడ్-మికుల్స్కైట్ ద్వయంపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చెలరేగిన అంకిత జోడీ.. వరుస సెట్లలో విజృంభించింది.
మరోవైపు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 6-7 (4/7), 3-6తో యోనోవో కు (కొరియా) చేతిలో ఓడింది. తొలి సెట్లో కడవరకు పోరాడిన అంకిత.. చివరి నిమిషంలో ఓటమి పాలవగా.. రెండో సెట్ ఆరంభం నుంచే ప్రత్యర్థి విజృంభించడంతో అంకితకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్లో రెండు డబుల్స్ ఫాల్ట్స్ చేసిన అంకిత రైనా.. 6 బ్రేక్ పాయింట్లు సాధించింది.