Ishant Sharma : భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో ఆకట్టుకున్న అతను క్రికెట్ కామెంటేటర్(Cricket Commentator)గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. అవును.. భారత్, వెస్టిండీస్ టెస్టు సిరీస్( India – Westindies Test Series)లో లంబూ కామెంటరీ బాక్స్లో సందడి చేయనున్నాడు. కామెంటేటర్గా అతడికి ఇదే తొలి సిరీస్. కరీబియన్ గడ్డపై ఇషాంత్ హిందీలో క్రికెట్ వ్యాఖ్యానం చేయనున్నట్టు సమాచారం.
టెస్టుల్లో 10 వికెట్లు తీసిన విండీస్పైనే ఇషాంత్ కామెంటేటర్గా కెరీర్ ప్రారంభించడం విశేషం. 2011లో బ్రిడ్జ్టౌన్(Bridgetown)లో జరిగిన రెండో టెస్టులో లంబూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఇషాంత్ ఇప్పటివరకూ 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈమధ్యే ముగిసిన 16వ సీజన్ ఐపీఎల్లో అతను ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున ఆడాడు.
Ishant Sharma, whose only 10-wicket haul in Tests came against the #WestIndies – will be in our comm box for India’s upcoming series!🎙️#SabJawaabMilenge only on #JioCinema ✨#WIvIND | @ImIshant pic.twitter.com/gL0xNxnok1
— JioCinema (@JioCinema) July 9, 2023
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్టటికే విండీస్కు చేరిన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొడుతున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆఫ్ స్టంప్స్ బంతుల్ని ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాడు.
ఇషాంత్ శర్మ
కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) తమ ఫుట్వర్క్కు పదును పెడుతున్నారు. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జూలై 12 బార్బడాస్లో మొదలవ్వనుంది. రెండో టెస్టు జూలై 20 పోర్ట్ ఆఫ్ స్పెయిన్(Port Of Spain)లో జరగనుంది. 2024-25 డబ్ల్యూటీసీ(WTC) సీజన్లో రోహిత్ శర్మ సేనకు ఇదే తొలి టెస్టు సిరీస్. దాంతో, భారత జట్టు ఈ సిరీస్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.