ఐసీసీ ప్రపంచకప్ల్లో ఇంగ్లండ్పై ఐర్లాండ్ నెగ్గడం ఇది రెండోసారి. 2011 వన్డే ప్రపంచకప్లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్లోనూ ఐర్లాండ్ సంచలన బ్యాటింగ్తో ఇంగ్లండ్ను చిత్తుచేసిన విషయం తెలిసిందే.
మెల్బోర్న్: సులువుగా గెలువాల్సిన మ్యాచ్లో వరుణుడి కారణంగా ఇంగ్లండ్ పరాజయం వైపు నిలిచింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఐర్లాండ్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో 14.3 ఓవర్లలో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం ప్రారంభంకాగా.. కటాఫ్ సమయంలో తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం విజేతను నిర్ణయించారు. 14.3 ఓవర్లలో ఇంగ్లండ్ 111 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు దానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఇంగ్లండ్కు నిరాశ తప్పలేదు. టీ20 ప్రపంచకప్ ‘సూపర్’ దశలో ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఐర్లాండ్ కెప్టెన్ బాల్బిర్నీ (62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. టకర్ (34) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్స్టోన్, వుడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం కష్టతరం కాని పరుగుల చేజింగ్లో ఇంగ్లండ్ తడబడింది. బట్లర్ (0), హేల్స్ (7), స్టోక్స్ (6) విఫలంకాగా.. మలన్ (37 బంతుల్లో 35), బ్రూక్ (21 బంతుల్లో 18) నెమ్మదిగా ఆడారు. మోయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టినా ఫలితం లేకపోయింది. గ్రూప్-1లో భాగంగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగాల్సిన మరో మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రైద్దెంది.