IPL-Team India | ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2022 మెగావేలంలో పది ఫ్రాంచైసీలు పట్టించుకోలేదు.. కానీ ఈ నెల 24 నుంచి మొదలయ్యే శ్రీలంక – టీం ఇండియా సిరీస్కు ఎంపికయ్యాడు ఆ 28 ఏండ్ల కుర్రాడు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్కు చెందిన శౌరబ్ కుమార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్. ఆయన్ను శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్కు టీం ఇండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ చెప్పారు. గతేడాది పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మాత్రం సౌరబ్ కుమార్కు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఎంపిక కావడంతో టీం ఇండియా జట్టులో తొలిసారి చోటు దక్కించుకోగలిగాడు సౌరబ్ కుమార్. ఇండియా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరబ్ కుమార్ పేరు అందరికీ తెలుసు. 2014లో హిమాచల్ ప్రదేశ్కు వ్యతిరేకంగా తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. తర్వాత ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
రెండు సెంచరీలు చేసిన సౌరబ్ కుమార్ 196 వికెట్లు తీశాడు. 46 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. సౌరబ్ తీసుకున్న 196 వికెట్లలో యావరేజీ 24.15. 16 సార్లు ఐదు వికెట్లు, ఆరు సార్లు 10 వికెట్లు తీశాడు. బ్యాట్స్మన్గా 1572 పరుగులు చేసిన సౌరబ్ కుమార్ యావరేజీ స్కోర్ 29.11 పరుగులు. ఇందులోనే రెండు సెంచరీలున్నాయి. ఇండియా ఏ టీంలో సౌతాఫ్రికా వెళ్లినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు అనధికారిక టెస్టుల్లో నాలుగు వికెట్లు తీసి, 23 పరుగులు మాత్రమే చేశాడు.